Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులు, కార్మికులపై కేంద్రం ప్రభుత్వం పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకో వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లాకు పోలీసు నోటీసు ఇవ్వడాన్ని రైతు సంఘం ఖండింస్తుంది. రైతు వ్యతిరేక చట్టాలకు నిరసన తెలిపిన నాయకులను, కార్యకర్తలను బెదిరించేందుకు కేంద్రం పోలీసు లను ఉపయోగించు కున్న దని విమర్శించింది. ఈమేరకు శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి జంగారెడ్డి, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ప్రభుత్వం చేసిన పిరికి ప్రయత్నమని పేర్కొంది. అణచివేత, బెదిరింపులు ఉద్యమాలను ఆపలేవని హెచ్చరిం చారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడికి నిరసనగా 5న రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం చేయాలని పిలుపునిచ్చారు.