Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి సీఎమ్డీ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశంలో బొగ్గుకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ నెల నుంచి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సీఎమ్డీ ఎన్ శ్రీధర్ అదేశించారు. శుక్రవారంనాడాయన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్పత్తితో పాటు 1.85 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 13.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాలను సాధించాలని చెప్పారు. కొత్త ఓపెన్కాస్టుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు కాంట్రాక్టులను వెంటనే ఖరారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో కోల్మూమెంట్ ఈడీ జె ఆల్విన్, అడ్వయిజర్ (మైనింగ్) డిఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.