Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన సంతోష్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు అయినేని సంతోష్కుమార్ తెలిపారు. ఈ మేరకు సమస్యలను వివరించేందుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుతూ ఆయన మంగళవారం లేఖ రాశారు. ప్రయివేటు అధ్యాపకులు జీతాల్లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితుల్లో జీతాలు చెల్లించకుండా యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయని తెలిపారు. తమ సమస్యలపై స్పందించాలని ప్రధాని మోడీకి లేఖ రాశామని గుర్తు చేశారు.