Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ)ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. పీఆర్టీయూటీఎస్ అనుబంధంగా ఉన్న తెలంగాణ ఐఈఆర్పీ టీచర్స్ యూనియన్ క్యాలెండర్ను మంగళవారం హైదరాబాద్లో ఆమె ఆవిష్కరించారు. ఐఈఆర్పీలు ఎదుర్కొంటున్న వేతనాల పెరుగుదల, బదిలీల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, ఐఈఆర్పీటీచర్స్ యూనియన్ అధ్యక్షులు సిలివేరి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి జంగం సుమన్, ఉపాధ్యక్షులు రాజయ్య, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.