Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రానికి మరో 3.48 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. వీటిని కోఠిలోని ఇమ్యూనైజేషన్ సెంటర్లో నిల్వ ఉంచారు. రెండో దశ పంపిణీ కోసం జిల్లాలకు తరలించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును కేంద్రం ప్రశంసించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సయ్యద్ ముర్తుజా అలీ రిజ్వీ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు 92 శాతం, రెండో రోజు 80 శాతం, మూడో రోజు 71 శాతం లక్ష్యాన్ని తెలంగాణ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 69,625 మంది వ్యాక్సిన్ వేసుకోగా 77 మందికి మాత్రమే రియాక్షన్లు వచ్చాయి. వారిలో ముగ్గురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్యారోగ్యశాఖ యంత్రాంగం, జిల్లా కలెక్టర్లను రిజ్వీ ప్రశంసించారు.