Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బీఐ చైర్మెన్ దినేష్ ఖారా హైదరాబాద్ పర్యటన
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పట్టణాభివృద్ధిప పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం సహా.. వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సంబంధించి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా బ్యాంకుకు సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో మంగళవారం పాల్గొన్నారు. హైదరాబాద్ ఎల్హెచ్ఓలో స్థానిక బోర్డు సమా వేశాన్ని నిర్వహించారు. అలాగే కొంపల్లిలో ఆన్లైన్ ద్వారా రీటైల్ అసెట్ క్రెడిట్ ప్రాసెసింగ్ సెంటర్ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం రాష్ట్రంలోని బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహకులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలోనూ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిరంతరాయంగా సిబ్బంది అందించిన సహకారాన్ని దినేష్ ఖారా కొనియాడారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద పలు సహాయ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక, సహాయం, పర్యావరణ, సామాజిక కార్యకలాపాల్లో బ్యాంకు పాలు పంచుకుంటున్నట్టు తెలిపారు. సీఎస్ఆర్ కార్యకలాపాల కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.300 లక్షలను ఖర్చుపెట్టినట్టు చెప్పారు. కోవిడ్ మహమ్మారిపై పోరులోనూ వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలిపారు. పీపీఈ కిట్లు, రేషనన కిట్లు, ఆహార ప్యాకెట్లు, వెంటిలేటర్స్, థర్మల్ స్కానర్స్, ఈసీజీ వంటి వైద్య పరికరాలు సహా పలు సహాయ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నట్టు తెలిపారు.