Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయడానికి ఓ వ్యక్తి నుంచి రూ. 75 వేలు లంచం డిమాండ్ చేసిన గిడ్డంగుల శాఖ ఎండీ భాస్కరాచారిని, అతని సూచనల మేరకు లంచం తీసుకున్న జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డిని బుధవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. భాస్కరాచారి గిడ్డంగుల శాఖతోపాటు ప్రస్తుతం మార్క్ఫెడ్, హాకా ఎండీగా కూడా వ్యవహరిస్తున్నారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. గిడ్డంగుల శాఖలో మేనేజర్గా పనిచేస్తూ రిటైర్డ్ అయిన బానోత్ సుందర్ లాల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం భాస్కరాచారిని సంప్రదించారు. అందుకోసం అతను రూ.75 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో సుందర్లాల్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు భాస్కరాచారిని సంప్రదించగా అతను ఆ డబ్బును నాంపల్లిలోని జీఎం సుధాకర్రెడ్డికి ఇవ్వాలని సూచించారు. దీంతో డబ్బును సుధాకర్రెడ్డికి అతని ఆఫీస్ చాంబర్లో ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో ఎండీ భాస్కరాచారిని ఎ1, సుధాకర్ రెడ్డిని ఎ2గా కేసులు నమోదు చేసి, ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు.