Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమల్జేస్తున్నదని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది ఉందా..? అని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్రెడ్డి, కొప్పుల మహేశ్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఏవో రెండు ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన బీజేపీ నేతలు అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఆ పార్టీకి తెలంగాణలో అసలు చోటే లేదని విమర్శించారు. కేసీఆర్ను జైల్లో పెడతామంటూ మాట్లాడుతున్న కమలం పార్టీ నేతలకు నిజంగా అంత శీనుందా...? అని ప్రశ్నించారు. వికారాబాద్ సభలో సీఎంపై బండి సంజరు చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.