Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారోబార్ గా పనిచేస్తూ వ్యవసాయం
నవతెలంగాణ-రేగొండ
వ్యవసాయానికి తెచ్చిన అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురై కారోబార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రామన్నగూడెం తండాలో బుధవారం జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాదావత్ చందూలాల్ (33) వృత్తిరీత్యా కారోబార్గా పని చేసుకుంటూ తనకున్న ఎకరం భూమితో పాటు మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పెట్టుబడి కోసం రూ.4లక్షలు అప్పు తీసుకొచ్చాడు. పంట దిగుబడి తక్కువగా రావడంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. దాంతో తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.