Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తపాలా సర్వీసులకు సంబంధించిన 'డాక్ అదాలత్' ఫిబ్రవరి 11వ తేదీన జరగనుంది. ఇందుకు సంబంధించి తపాలా శాఖ ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర పరిధిలోకి వచ్చే తపాలా సర్వీసులకు సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే ఈ డాక్ అదాలత్కు నివేదించాలి. ఫిర్యాదులను ఎం. మన్మధరావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్(రిక్రూట్మెంట్/పబ్లిక్ గ్రీవెన్సెస్), ఆఫీస్ ఆఫ్ ది ఛీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్, ఆబిడ్స్, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్-500001 చిరునామాకు పంపాలి. ఛీఫ్ పోస్టమాస్టర్ జనరల్ కార్యాలయంలోని రెండవ అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ 'డాక్ అదాలత్'ను నిర్వహిస్తారు. రాష్ట్రం పరిధిలోని పోస్టల్ సర్వీసులకు సంబంధించిన సమస్యలను మాత్రమే ఫిర్యాదుల రూపంలో పంపాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫిర్యాదులను ఫిబ్రవరి నాలుగవ తేదీలోగా చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఫిబ్రవరి 11 వ తేదీ ఉదయం 11 గంటలకు డాక్సదన్ లోనే ఈ అదాలత్ను నిర్వహించనున్నారు. ఫిర్యాదులను కవరుపై 'డాక్ అదాలత్' అని తప్పనిసరిగా రాయాలి.