Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ (పీయూసీ) సమావేశం ఫిబ్రవరి 3వ తేదీన జరగనుందని అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్లో ఉదయం 11.30గంటలకు జరిగే సమావేశంలో తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (జెన్కో), ఫ్యూయల్ మేనేజ్మెంట్, 2014-15 సంవత్సరానికి కాగ్ నివేదిక తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు.