Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఈటల రాజేందర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెండింగ్లో ఉన్న ఆస్పత్రుల భవనాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు.హైదరాబాద్లో సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నిర్మిస్తున్న ప్రతి భవనానికి పూర్తిస్థాయిలో సదుపాయాలు ఉండేలా చూడాన్నారు.. ఆక్సిజన్ పైప్లైన్లు, అగ్నిమాపక పరికరాలు, లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్ సౌకర్యాలను టెండర్లలోనే పొందుపరచాలని సూచించారు. వైద్య పరికరాలు , మందులు, భవన నిర్మాణాల్లో పెండింగ్ బిల్లులు వివరాలను అందజేయాలని సూచించారు. బోధనాస్పత్రులు, వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అప్ గ్రేడ్ అయిన వాటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్రెడ్డి, తెలంగాణ వైద్య మౌలిక వసతుల కార్పొరేషన్ ఎం.డీ. డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.
నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన సీఎస్
నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సోమవారం అధికారులు, సచివాలయ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఓటు వేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని సీఎస్ పేర్కొన్నారు. ఓటరుగా హక్కులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా కార్యక్రమంలో జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.