Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చికిత్స కోసం హైదరాబాద్కు తరలింపు
నవతెలంగాణ - వేములవాడ
కోవిడ్ - 19 వాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. వేములవాడ మండలం చంద్రగిరి గ్రామానికి చెందిన ఆశావర్కర్ సందెల శంకరవ్వ ఈ నెల 18న కరోనా వాక్సిన్ వేసుకుంది. అదేరోజు సాయంత్రం విరేచనాలతో కూడిన జ్వరం వచ్చింది. దాంతో శంకరవ్వను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జ్వరం తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు రెండ్రోజుల తరువాత సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందినా జ్వరం తగ్గలేదు. దీనికి తోడు ఛాతిలో నొప్పి రావడంతో మెరుగైన వైద్యం కోసం సోమవారం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు గ్రామస్థులు తెలిపారు.