Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరూర్నగర్ స్టేడియం నుంచి ఉప్పల్ వరకు మోటార్ సైకిళ్లు, కార్లు, ఆటోలతో ప్రదర్శన :
ఏఐఏడబ్ల్యూయూ, సీఐటీయూ, రైతుసంఘం పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో కిసాన్-మజ్దూర్ పరేడ్ నిర్వహించనున్నట్టు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ), తెలంగాణ రైతుసంఘం పిలుపునిచ్చాయి. సోమవారం హైదరాబాద్లో ప్రజాసంఘాల సమావేశం జరిగింది. ప్రధాన కార్యదర్శి బి వెంకట్ (సీఐటీయూ), కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో సరూర్నగర్ స్టేడియం నుంచి ఉప్పల్ రింగ్రోడ్డు వరకు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వాహనాల ప్రదర్శన ప్రారంభమవుతుందని చెప్పారు. మోటార్ సైకిళ్లు, కార్లు, ఆటోలు, సైకిళ్లతో పాల్గొనాలని కోరారు. గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా ప్రతి వాహనానికీ జాతీయ జెండా, ప్రజాసంఘాల జెండాలతో రైతుల పక్షాన నిలబడే ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ అనుకూల చట్టాలను రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని అన్నారు.