Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది కార్మికుల విజయం : చుక్క రాములు
నవతెలంగాణ - జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో సీఐటీయూ ఘనవిజయం సాధించింది. పరిశ్రమలో సోమవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎంఎస్ అభ్యర్థి రాములు యాదవ్పై సీఐటీయూ అభ్యర్థి చుక్క రాములు 150 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పరిశ్రమలో మొత్తం 625 ఓట్లకు గాను 620 ఓట్లు నమోదయ్యయి. అందులో సీఐటీయూ అభ్యర్థి చుక్క రాములుకు 385, టీఎంఎస్ అభ్యర్థి రాములు యాదవ్కు 235 ఓట్లు వచ్చాయి. అనంతరం మహీంద్రా ఆండ్ మహీంద్రా పరిశ్రమ నుంచి భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారికి రావాల్సిన హక్కులను కల్పించేందుకు సీఐటీయూ పని చేస్తుందన్నారు. అందుకే రెండోసారి మహీంద్రా కార్మికులు సీఐటీయూను గెలిపించారన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, నాయకులు బి.రాంచందర్, రాజయ్య, జి. సాయిలు, రాజిరెడ్డి, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.