Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పురపాలక సంఘాల్లో పారదర్శకత, మొక్కల పెంపకం, శాస్త్రీయ పద్ధతిలో బడ్జెట్ రూపకల్పన కోసం వార్డు కమిటీలను తక్షణం ఏర్పాటు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎమ్ పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాసారు. తెలంగాణ మున్సిపాల్టీల చట్టం-2019 అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ చట్టం ప్రకారం వార్డు కమిటీల్లో యువకులు, మహిళలు, వయోజనులు, వార్డులోని ముఖ్యులతో ఒక్కో విభాగానికి 15 మందికి మించకుండా 60 మంది సభ్యులతో వార్డు కమిటీల నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. ఈ కమిటీలు ప్రజలకు మున్సిపాల్టీలకు మధ్య వారధిగా పనిచేస్తాయని వివరించారు..