Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాలపై అన్నీ అబద్ధాలే.. : భట్టి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగులను మో సం చేస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ రెండు పార్టీ తోడు దొంగ ల్లా ఉద్యోగాలపై కాకిలెక్కలు చెబుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు కల్పించాయో..చర్చకు రావాలని డిమాండ్ చేశారు. మంగళ వారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వల్ల దేశంలోనూ, రాష్ట్రంలోనూ యువత ఉద్యోగాలు లేక నిరాశలో ఉందని చెప్పారు.