Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం, దుస్తుల పంపిణీ
నవతెలంగాణ-బోడుప్పల్
హోంమంత్రి మహమూద్ అలీ బర్త్ డే సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ఫీర్జాదిగూడ మున్సిపల్ పరిధి మేడిపల్లిలోని అమ్మవొడి అనాథాశ్రమంలో అన్నదానం చేశారు. కేటీఆర్ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.ఎం ముజీబ్ ఆధ్వర్యంలో అన్నదానం, దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని కేటీఆర్ సేవాసమితి యువనాయకులు ఎం.ఎం అజ్జు నిర్వహించారు. ఈ సందర్భంగా అజ్జు మాట్లాడుతూ.. అనాథాశ్రమాలను ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. మహమూద్ అలీ తన బర్త్ డే సందర్భంగా వేడుకలు నిర్వహించకూడదని, అనాథలను ఆదుకోవాలని సూచించారని చెప్పారు. స్టూడెంట్స్కు నోట్బుక్స్, పేదలకు నిత్యావసరాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. అనంతరం అనాథాశ్రమంలో కేక్ కట్చేసి హోంమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మహేశ్, శ్రీనివాస్, భూపాల్, దినేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.