Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంఈ/ఎంటెక్/ ఎంఆర్క్/ఎంఫార్మసీ/ ఫార్మాడీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. గురువారం పీజీఈసెట్ కమిటీ తొలి సమావేశం ఆన్లైన్లో గురువారం జరిగింది. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, పీజీఈసెట్ కన్వీనర్ పి లక్ష్మినారాయణ షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇతర వివరాలకు http://pgecet.tsche.ac.in లేదా http://www.tsche.ac.in వెబ్సైట్లను అభ్యర్థులు సంప్రదించాలని కోరారు.