Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా భద్రతా విభాగం వర్క్షాప్లో వక్తల పిలుపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మహిళలపై వేధింపులు అరికట్టడానికి, బాలలపై నేరాలను అదుపు చేయడానికి సైబర్వాలంటీయర్స్ వ్యవస్థ పటిష్ట వంతం కావాలని , అందుకు సమాజంలోని ప్రతి ఒక్కరు సహకరించాలని సైబర్ వాలంటీయర్స్ శిక్షణ వెబ్ వర్క్షాప్లో వక్తలు పిలుపు నిచ్చారు. గురువారం డీజీపీ కార్యాలయం నుంచి సైబర్ వాలంటీయర్స్పై సాగిన శిక్షణ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, ప్రముఖ సైబర్ నేరాల నిపుణుడు రక్షిత్ టండన్ తదితరులు పాల్గొన్నారు. వర్క్షాప్ను ప్రారంభించిన అదనపు డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు చైతన్యం కావలసిన అవసరం ఉందని అన్నారు. అదే సమయంలో జరుగుతున్న నేరాలపై ఫిర్యాదులు చేయడానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ఇందుకు సైబర్ వాలంటీయర్స్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆమె అన్నారు. సైబర్ నిపుణుడు రక్షిత్ టండన్ మాట్లాడుతూ సైబర్ నేరాలలో చోటు చేసుకుంటున్న కొత్త కొత్త నేరాలు, వాటి తీరు తెన్నులు, వాటిపై ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ ఈ సారి తాము నిర్వహించిన వెబ్ వర్క్షాప్లో రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల నుంచి మూడు వేల మంది విద్యార్థులు, టీచర్లు, కాలేజీ లెక్చరర్లు పాల్గొన్నారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడేసి గంటల చొప్పున మూడు వర్క్షాప్లను వేరు వేరుగా నిర్వహించడం జరిగిందని, దీనికి కో ఆర్డినేటర్గా రక్షిత్ టండన్ వ్యవహరించారని ఆమె తెలిపారు.