Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా మకరతోరణం తరలింపు
నవతెలంగాణ-చివ్వెంల
రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలో జరుగుతున్న (పెద్దగట్టు) శ్రీ శ్రీ లింగమంతుల స్వామి జాతర గురువారంతో ముగిసింది. గంపల ప్రదక్షిణతో మొదలైన జాతర గురువారం వల్లపు వంశస్థులు, కోడివంశస్థులు ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించి మకరతోరణం తరలింపుతో జాతర ముగిసింది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర కావడంతో పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండేగాక ఒరిషా, కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు భారీగా తరలివచ్చి లింగమంతుల స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.