Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఆరో రోజూ కొనసాగింది. శనివారం 438 ఆస్పత్రుల్లో 37,658 మంది కోవిడ్-19 వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. వీరిలో 60 ఏండ్ల పైబడిన వారితో పాటు 45 ఏండ్లకు పైగా వయస్సు కలిగి ఇతర వ్యాధులున్న వారు 24,855 మంది ఉన్నారు. ఇక, వైద్యారోగ్య సిబ్బందిలో 1231 మంది మొదటి డోసు, 1274 మంది రెండో డోసు, ఫ్రంట్ లైన్ వర్కర్లు 4971 మంది మొదటి డోసు, 9498 మంది రెండో డోసు వేయించుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి డోసు తీసుకున్నవారి సంఖ్య 3,74,871కి కాగా రెండో డోసు తీసుకున్న వారు 1,70,629. శనివారం 325 ప్రభుత్వాస్పత్రుల్లో 11,915 మందికి వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 10,939 మందికీ, 113 ప్రయివేటు ఆస్పత్రుల్లో 16,223 మందికిగాను 13,916 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.