Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గాంబో నాగరాజును టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆయన పుకార్లు వ్యాప్తి చేస్తున్నారనే కారణాన్ని సాకుగా చూపి ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలనీ, విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన ఇటీవలే యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద 327 యూనియన్తో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జిజన్ కార్మికుల సమస్యల్ని ప్రస్తావిస్తూ, అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఆగ్రహించిన యాజమాన్యం ఆయన్ని సస్పెండ్ చేస్తూ శనివారం నోటీసు అందచేసింది. తెలంగాణ ఉద్యమంలో ఆయన అప్పటి ఉద్యమనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్రావు వంటి వారితో కలిసి పనిచేశారు. ఆర్టిజన్ కార్మికుల కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమని గాంబో నాగరాజు 'నవతెలంగాణ'తో చెప్పారు.