Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఐదుగురు సంయుక్త సంచాలకులు (జేడీ)కు అదనపు సంచాలకులు (ఏడీ)గా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. వారికి శనివారం బాధ్యతలు కేటాయించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ఉత్తర్వులు విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖ కో ఆర్డినేషన్, సర్వీసు అంశాలకు అదనపు సంచాలకులు కె లింగయ్య, సమగ్ర శిక్ష అదనపు స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏఎస్పీడీ)గా జి రమేశ్, ప్రభుత్వ ముద్రణాలయ సంస్థ సంచాలకులుగా ఎస్ శ్రీనివాసాచారి, మోడల్ స్కూల్స్ అదనపు సంచాలకులుగా జి ఉషారాణి, వయోజన విద్య సంచాలకులుగా ఎస్ విజయలక్ష్మి బాయిని నియమించామని తెలిపారు. పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ గవర్నర్స్ కార్యదర్శిగా ఎస్సీఈఆర్టీ సంచాలకులుగా ఎం రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులుగా ఎ సత్యనారాయణరెడ్డి, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా, ప్రభుత్వ గ్రంథాలయాల సంస్థ సంచాలకులుగా సిహెచ్ రమణకుమార్కు పూర్తి బాధ్యతలు అప్పగించామని వివరించారు.