Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మహాశివరాత్రి సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు శ్రీశైలంకు 250 ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నది. ఎమ్జీబీఎస్, జూబ్లీ బస్టేషన్, దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్, కెపిహెచ్బీ పాయింట్స్ నుంచి ఈ బస్సులు నడుస్తాయి. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉంది. కాకపోతే...'స్పెషల్' బస్సులు కాబట్టి ప్రయాణీకుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఎమ్జీబీఎస్ నుంచి శ్రీశైలంకు సాధారణ రోజుల్లో సూపర్ లగ్జరీ బస్సుకు రూ.358, ఎక్స్ప్రెస్ బస్సుకు రూ.290 చార్జీ ఉంటుంది. ఈ ప్రత్యేక బస్సుల్లో (నాన్ ఏసీ) సూపర్ లగ్జరీకి రూ. 550, ఎక్స్ప్రెస్కు రూ.400, డీలక్స్ బస్సుకు రూ.450 వసూలు చేస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ బి వరప్రసాద్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా శివరాత్రి ప్రత్యేక బస్సుల కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ప్రయాణీకులు తమ టిక్కెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.