Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ఎమ్మెల్యే రాజాసింగ్ను బర్తరఫ్ చేయాలనీ, ఆవులను పూజించి అమ్మలను దూషించే వాడు దేశభక్తుడేలా అవుతాడని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా క్లబ్ ఫంక్షన్ హాల్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కైలాబ్బాబు మాట్లాడుతూ.. ఆవు మాంసం యేటా 14 లక్షల టన్నులు ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసేవాళ్లు బీజేపీ అగ్రనేతలేనని గుర్తుచేశారు. ఆవు మాంసం తినే కోట్లాది మంది దళితుల మనోభావులు దెబ్బతీసిన రాజాసింగ్ వ్యాఖ్యలను రాష్ట్ర డీజీపీ సుమోటోగా తీసుకొని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సంస్కారహీనంగా మాట్లాడిన ఎమ్మెల్యేను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్, ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి అంజయ్య, బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అమరేశ్వర్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.