Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయ్యారంలో స్టీల్ ప్లాంటుకు అనుమతిస్తుందా...?
- బీజేపీకి ఓటెందుకు వేయాలి...?
- విద్యారంగానికి కేంద్రం గుండు సున్నా పెట్టింది : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశం కోసం, ధర్మం కోసం అంటూ ఊదరగొడుతున్న బీజేపీ... వాస్తవానికి దేశం కోసం చేసిందేమీ లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. దేశం కోసం, ధర్మం కోసమే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటుకు అప్పజెపుతున్నారా...? అని ప్రశ్నించారు. అక్కడి కంపెనీని మూసేస్తున్న బీజేపీ... మన బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని పెడుతుందా...? అని అన్నారు. అసలు ఆ పార్టీకి ఓటెందుకు వేయాలని నిలదీశారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించారు. కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ... కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కొత్తగా ఐఐఎం, ఐఎస్ఆర్, ఐఐటీ, ట్రిపుల్ ఐటీలాంటి
సంస్థలను ఏర్పాటు చేసిన కేంద్రం.. రాష్ట్రానికి మాత్రం వాటిలో ఏ ఒక్కటీ ఇవ్వకుండా గుండు సున్నా పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. నవోదయా విద్యాలయాలను కూడా రాష్ట్రానికి కేటాయించలే దని తెలిపారు. బీజేపీ నేతలకు తెలంగాణ అనేది దేశంలో ఒక భాగం అనే విషయం గుర్తు లేదా...? అని ప్రశ్నించారు. అందువల్ల గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ప్రధాని మోడీ మాటలు కోట్లలో ఉంటాయనీ, చేతలు మాత్రం పకోడీ ల్లా ఉంటాయని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజీతో పేదలకు ఎలాంటి ప్రయోజనమూ జరగలే దని చెప్పారు. ఇలాంటి వాస్తవాలను మరిచిన రాష్ట్ర బీజేపీ నేతలు... తమ ప్రభుత్వంపైనా, పార్టీపైనా అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. తమ మౌనాన్ని బలహీనతగా భావించవద్దని హిత వు పలికారు. కమలం పార్టీ నేతలకు వాట్సాప్ యూనివర్సిటీల్లో అబద్ధా లను వల్లె వేయటం ఆనవాయితీగా మారిందని కేటీఆర్ విమర్శించారు.