Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా టౌన్
ఖమ్మం జిల్లా వైరా మండలం గోల్లెనపాడు గ్రామానికి చెందిన మధిర మోడ్రన్ విద్యాసంస్థల అధినేత అమరనేని అప్పారావు సతీమణి, సీపీఐ(ఎం) నాయకురాలు అమరనేని రమాదేవి(52) మంగళవారం గుండెపోటుతో మరణించారు. మరణవార్త తెలియగానే సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, భూక్య వీరభద్రం, వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు గ్రామానికి వెళ్లారు. రమాదేవి మృతదేహాన్ని సందర్శించి పూలమాలువేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీరితోపాటు మాజీ ఎంపీపీ బొంతు సమత, వైరా కోపరేటివ్ సొసైటీ వైస్ చైర్మెన్ కోణిదన కోటేశ్వరరావు, ఎంపిటిసి కిలారు లక్ష్మి, పార్టీ మండల నాయకులు నల్లమోతు వెంకటనారాయణ, కిలారి శీను, అమరనేని వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎం) మధిర పట్టణ కార్యదర్శి ఎస్ నర్సింహారావు నివాళి అర్పించారు.