Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో రైతులు
- ఖమ్మంలో సోమవారం వర్షానికి తీవ్ర నష్టం
నవతెలంగాణ-వర్ని/కోటగిరి/ఖమ్మం
నిజామాబాద్ జిల్లా ఉమ్మడి వర్ని మండలంలో మంగళవారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. పలు గ్రామాల్లో వరి పంట చేతికి రావడంతో నూర్పిడి చేసి ఆరబెట్టారు. వర్షం కురవడంతో రాత్రికి రాత్రే రైతులు ధాన్యాన్ని రాశులుగా పోగుచేసి టార్ఫా లిన్లు కప్పారు. ప్రభుత్వం వెనువెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతు న్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్పూర్ గ్రామ సమీపంలోని ఈత చెట్టుపై మంగళవారం సాయంత్రం పిడుగు పడింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో మండల పరిధిలో సోమవారం వీచిన గాలిదుమారానికి, వర్షానికి రైతుకు తీరని నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి పంట తడిసింది. ధాన్యం తడకుండా పట్టాల కోసం రైతులు నానా ఇబ్బందిపడ్డారు. పట్టాలను కిరాయికి తీసుకొచ్చి పంటను కాపాడుకున్నారు. వరి పైరు నేలవాలింది. 10 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. 53 ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్టు ఉద్యనవన శాఖ అధికారి తెలిపారు.