Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రెంజల్
వర్షానికి తీవ్రంగా నష్టపోతున్నామని, వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని బోర్గాంలో బుధవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రెండ్రోజులు కావస్తున్నా ఇంతవరకు కొనుగోళ్లు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలకు తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గంటసేపు రాస్తారోకో చేపట్టారు. ఎస్ఐ మురళి అక్కడికి వచ్చి ఐకేపీ ఏపీఎం చిన్నయ్యను పిలిపించి రైతులకు నచ్చచెప్పడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోలో రైతులు హనుమంత్రెడ్డి, గుజ్జ రమేష్, లక్ష్మణ్ పటేల్, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.