Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది మంది మరణం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 2157 మందికి కరోనా సోకింది. 72,364 మందికి పరీక్షలు చేయగా వారి లో 2.98 శాతం మందిలో వైరస్ బయటపడింది. మరో 4,959 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. 24 గంటల్లో కరోనాతో కోలుకన్న వారి సంఖ్య 821 మంది మాత్రమే. మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మొత్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,780కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 25,459 యాక్టివ్ కేసులున్నాయి.
ఆరు జిల్లాల్లో వందకు పైగా
రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 361 మందికి, మేడ్చల్-మల్కాజిగిరిలో 245, నిజామాబాద్ 187, రంగారెడ్డి 206, సంగారెడ్డి 135, జగిత్యాల జిల్లాలో 107 మంది వ్యాధి బారిన పడ్డట్టు గుర్తించారు. అతి తక్కువగా ములుగు ములుగు జిల్లాలో నాలుగు, మహబూబాబాద్ జిల్లాలో ఎనిమిది కేసులు వచ్చాయి. కాగా మిగిలిన అన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి.
554 మంది ఆస్పత్రుల్లో చేరిక..
తాజాగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 554 మంది చేరారు. రాష్ట్రంలో ప్రస్తుతం25,459 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో ప్రభుత్వాస్పత్రుల్లో 2,408 మంది, ప్రయివేటులో 6,159 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ప్రభుత్వాస్పత్రుల్లో 8,643 పడకలు, ప్రయివేటులో 12,973 పడకలను ప్రత్యేకంగా కరోనా రోగుల కోసం కేటాయించారు.
33,583 మందికి వ్యాక్సిన్..
తాజాగా 33,583 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో 31,077 మంది మొదటి డోసు వేసుకోగా, 2,506 మంది రెండో డోసు తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 20,10,611 కాగా రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 3,12,340 గా నమోదైంది. మొత్తం వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 23,22,951కు చేరింది.