Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్.. రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బుధవారమే ఒప్పందం జరిగిం దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తెలిపారు. త్వరలోనే ఆ నిర్మాణా న్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం హైదరా బాద్లోని ట్యాంక్బండ్పైగల ఆయన విగ్రహానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాసగౌడ్తో కలిసి కేటీఆర్ పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం బాబాసాహెబ్ పరితపించారని చెప్పారు. బోధించు, సమీకరించు, పోరాడు అంటూ ఆయన చూపిన మార్గంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనా విధానాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు.