Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఆర్టీసీ కార్మి కులు ఎక్కువ వైరస్ బారిన పడుతున్నారనీ, వారికి సరైన రక్షణ కల్పించి ప్రాణాలు కాపాడాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని టీఎస్ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రాంచందర్, వీఎస్ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో కోవిడ్-19 బాధితుల కోసం ప్రత్యేకంగా 100 బెడ్లను కేటాయించాలనీ, అవసరమైతే వెంటనేకార్పొరేట్ ఆస్పత్రులకు పంపాలని కోరారు.
కర్నాటక ఆర్టీసీ కార్మికులకు ఎస్డబ్ల్యూఎఫ్ నిధి
కర్నాటకలో ఈ నెల ఏడో తేదీ నుంచి సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు గా టీఎస్ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా రూ.34,271 రూపాయల సంఘీభావ నిధిని వసూలు చేసి పంపామని ఆ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రాంచందర్, వీఎస్ రావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్డబ్ల్యూఎఫ్ పిలుపు మేరకు చాలా డిపోలలో కార్మికులు సంఘీభావ నిధి ఇచ్చారనీ, వారందరికీ అభినందనలు తెలుపుతున్నామని తెలిపారు.