Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అభినయ థియేటర్ ట్రస్టు ఆధ్వర్యంలో జర్నలిస్టులు, నవతెలంగాణ సిబ్బందికి సోమవారం సరుకులు పంపిణీ చేశారు. రూ.1000 విలువ చేసే నిత్యావసర సరుకుల కిట్లను అభినయ థియేటర్ ట్రస్టు వ్యవస్థాపకులు అభినయ శ్రీనివాస్, నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్, హైదరాబాద్ రీజియన్ జనరల్ మేనేజర్ ఆర్.వాసు, సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అభినయ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు సేవ చేయడం గొప్ప అవకాశమన్నారు. భవిష్యత్లోనూ అనేక రకాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్ మాట్లాడుతూ.. అభినయ శ్రీనివాస్ తన ట్రస్టు ఆధ్వర్యంలో కరోనా, లాక్డౌన్తో ఇబ్బందులు ఎదుర్కొన్న నాటక రంగంలోని కళాకారులు, పేదల కోసం అనేక రకాల సేవ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. భవిష్యత్లో అభినయ ట్రస్టుకు అవసరమైన సహాయ సహకరాలు అందిస్తామని చెప్పారు. ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ మాట్లాడుతూ.. పోరాటాలు, ఉద్యమాలతోపాటు సేవా కార్యక్రమాలు కొత్త ఒరవడి అన్నారు. సుబ్బారావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో అభినయ ట్రస్టు ఆధ్వర్యంలో సుమారు కోటి రూపాయలకుపైగా విలువైన సరుకులు, ఇతర వస్తువులను వికలాంగులు, పేదలకు అందజేశామన్నారు. కూకట్పల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు. హైదరాబాద్ రీజియన్ జనరల్ మేనేజర్ ఆర్.వాసు మాట్లాడుతూ.. అభినయ శ్రీనివాస్ సహాయం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్లో ఆయన సహకారం ఉండాలని కోరారు. మేనేజర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.