Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడేండ్లుగా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయని దైన్యం
- దళితబంధు తరహాలోనే గీతన్న బంధు ఇవ్వాలి
- బైరు మల్లయ్య వర్ధంతి సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కల్లు గీత కార్పొరేషన్కు తగిన విధంగా నిధులు కేటాయించకపోవడంతో అది మూతపడిందని పలువురు వక్తలు తెలిపారు.సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బైరు మల్లయ్య ప్రధమ వర్థంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ మాట్లాడుతూ కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బైరు మల్లయ్య ఎంతో కృషి చేశారని చెప్పారు. అయితే వారి సంక్షేమం కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. కల్లుగీత కార్పొరేషన్లోని ఏడేండ్లుగా నామినేటెడ్ పోస్టుల్ని నియమించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని తెలిపారు. గీత వృత్తిదారులు స్వయం ఉపాధి పొందాలంటే కార్పొరేషన్కు ఐదువేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీమగోని చంద్రయ్య కేజీకేఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అబ్బగాని బిక్షం స్వతంత్య్రసమరయోధులు, భూపతి వెంకటేశ్వర్లు మోదుగుపూలు ఎడిటర్, యు.వెంకటనర్సయ్య ఉపాధ్యక్షులు, బాలగౌని బాలరాజు గౌడ్ తెలంగాణ గౌడ కల్లుగీత కార్మికసంఘం చైర్మెన్, ఎలికట్టె విజరుకుమార్ గౌడ్ గౌడజన హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు,గడ్డమీది విజరుకుమార్ గౌడ్ మన తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు,పి ఆశయ్య రజక వృత్తిదారుల సంఘం, ఆర్ శ్రీరాంనాయక్ తెలంగాణ గిరిజన సంఘం, ఉడుత రవీందర్ జీఎంపీఎస్, లెల్లెల బాలకృష్ణ మత్స్య కార్మిక సంఘం,జాజుల శ్రీనివాస్గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బొమ్మగాని ప్రభాకర్ గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షలు, అంబాల నారాయణ గౌడ ఐక్య వేదిక అధ్యక్షులు హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృత్తిలో ఆధునీకరణకు ఉన్న అవకాశాలను పరిశీలించి గౌడ యువతీ యువకులకు ఉపాధి కలిగే విధంగా చూడాలని వారు కోరారు. అందుకోసం నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలను ప్రతి జిల్లా కేంద్రంల్లోనూ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి 560 జీవో ప్రకారం ఐదెకరాల భూమిని ఇవ్వాలని కోరారు.
వృత్తిలో ప్రమాదం జరిగి చనిపోయినవారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు రూ.10లక్షల ఎక్సిగ్రేషియా ఇవ్వాలన్నారు.. శాశ్వత వికలాంగులకు మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వాలనే ప్రభుత్వ నిబంధన వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, గతంలో మాదిరిగా ప్రభుత్వ డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే ఎక్సిగ్రేషియా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు మాదిరిగానే గీతన్న బంధు ఇవ్వాలన్నారు.