Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే రెండు పెండ్లిళ్లు.. మరో యువతిపై బలవంతం
- మేడిపల్లి పీఎస్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఫాస్టర్ బాగోతం
నవతెలంగాణ-బోడుప్పల్
అతనో మత భోధకుడు. నిత్యం ఆరాధానలు చేసే ఫాస్టర్.. ఆ ముసుగులో చర్చికి వచ్చే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ప్రబుద్ధుడు.. మరో యువతిపై లైంగికదాడి చేశాడు.. బాధితుల ఫిర్యాదుతో నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్లోని మేడిపల్లి పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. మేడిపల్లి సీఐ బీ.అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని సాయి మారుతీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సాధు చిన్న వెంకటేశ్వర్లు అలియాస్ జోసెఫ్ కొన్నేండ్లుగా ఓ చర్చిలో ఫాస్టర్గా చేస్తున్నాడు. ఉప్పల్ ప్రాంతంలో మరో చర్చిని ప్రారంభించాడు. టీవీ చానల్లో ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఇతనికి 2010లో వివాహైంది. వీరికి ఒకపాప. ఆ పాప పుట్టిన కొన్ని రోజులకే భార్య సంధ్య మృతిచెందింది. 2015లో రెడేకా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈమెకు బాబు పుట్టాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో రెడేకా కొడుకుతో కలిసి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో జోసెఫ్ ఉప్పల్లో నూతనంగా ప్రారంభించిన చర్చిలో టెలికాలర్గా పని చేసే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. 2020 జనవరిలో ప్రార్థనల కోసమని అమెను కారులో శంషాబాద్ సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అప్పటి నుంచి పెండ్లి పేరుతో పలుమార్లు కోరిక తీర్చుకున్నాడు. పెండ్లి విషయాన్ని పదే పదే దాట వేస్తున్నాడు. ఈ నెల 4న ఆ యువతి జోసెఫ్ ఇంటికి వెళ్లి పెండ్లిపై నిలదీయడంతో నిరాకరించాడు. దాంతో తనను పెండ్లి పేరుతో మోసం చేశాడని మేడిపల్లి పీఎస్లో ఫిర్యాదు చేసింది. అంతేగాక తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని రెండో భార్య రెడేకా కూడా ఈ నెల 3 పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని రిమాండ్కు తరలించారు.