Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరి మృతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 301 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఇద్దరు మరణించారు. సోమవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.44 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం5.30 గంటల వరకు 67,720 మందికి టెస్టులు చేశారు.ప్రభుత్వాస్పత్రుల్లో 63,049 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,671మందికి పరీక్షలు నిర్వహించారు.మరో 1,400మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,505 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న 339 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 70 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా మెదక్, నారాయణపేట జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. వనపర్తి జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదురాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో ఆదివారంతో పోలిస్తే సోమవారం 25 జిల్లాల్లో కేసులు పెరిగాయి.ఆదిలాబాద్,భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల,జయశంకర్ భూపాలపల్లి,కామారెడ్డి,కరీంనగర్,ఖమ్మం,కొమురంభీం ఆసిఫాబా ద్,మహబూబ్ నగర్,మహబూబాబాద్,మంచి ర్యాల ,ములుగు, నాగర్ కర్నూల్,నల్లగొండ,నారాయణపేట, నిర్మల్,నిజామా బాద్,పెద్దప ల్లి,రాజన్న సిరిసిల్ల,రంగారెడ్డి,సూర్యాపేట,వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
ఆరు జిల్లాల్లో తగ్గిన కేసులు...
జీహెచ్ఎంసీతో పాటు జనగామ, మెదక్, మేడ్చల్ - మల్కాజిగిరి, సిద్ధిపేట, వనపర్తి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో వరసగా మూడో రోజూ మూడు కేసులొచ్చాయి.