Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ 13 నుంచి 18 వరకు నిర్వహణ
- కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం
- మార్చి 23 నుంచి వార్షిక పరీక్షలు
- జూనియర్ కాలేజీల పనిదినాలు 220
- అకడమిక్ క్యాలెండర్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇం టర్మీడి యెట్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణ యంతీసు కుంది. ప్రస్తుత విద్యాస ంవత్స రంలో అర్ధసం వత్సరం, ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం విడుదల చేశారు. ఇంటర్ అర్ధసంవత్సరం పరీక్షలను డిసెంబర్ 13 నుంచి 18 వరకు నిర్వహిస్తామని తెలిపారు. 2022, ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతాయని వివరించారు. అదేనెల 23 నుంచి మార్చి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు జరుగుతాయని ప్రకటించారు. ఏప్రిల్ 13 చివరి పనిదినమని తెలిపారు. ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులుంటాయనీ, జూన్ ఒకటిన కాలేజీలు పున:ప్రారంభమవుతాయని వివరించారు. మే చివరి వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలుంటాయని తెలిపారు. సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 18 వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్ తరగతులు 47 రోజులు, ప్రత్యక్ష బోధన 173 రోజులు కలిపి 220 పనిదినాలుంటాయని తెలిపారు. అక్టోబర్ 13 నుంచి 16 వరకు దసరా సెలవులు, 2022, జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులుంటాయని వివరించారు.
అకడమిక్ క్యాలెండర్లో ముఖ్యాంశాలు
- సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభం
- డిసెంబర్ 13 నుంచి 18 వరకు అర్ధసంవత్సరం పరీక్షలు
- ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్
- ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ప్రాక్టికల్స్
- మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు
- ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
- జూన్ 1న కాలేజీలు పున:ప్రారంభం