Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7,591 మంది దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే డీసెట్ రాతపరీక్ష బుధవారం జరగనుంది. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి సోమవారం తనను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 7,591 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. తెలుగు మీడియం అభ్యర్థులకు బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని అన్నారు.