Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్గౌడ్ భూ కబ్జాలపై విచారణ జరిపించాలి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల
నవతెలంగాణ - మహబూబ్నగర్
రాష్ట్రంలో వందలాది మంది నిరుద్యోగులను చంపింది కేసీఆర్ ప్రభుత్వమేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ ఎదుట నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఐదు సంవత్సరాల వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఉద్యోగ క్యాలెండర్ ద్వారా లక్ష ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తు చేసింది. రాజశేఖరరెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ నేడు ఎందుకు సరిగా అమలవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లాకు భారీ నీటి ప్రాజెక్టులు తెచ్చింది రాజశేఖర్రెడ్డి అని చెప్పారు. పాలమూరు యూనివర్సిటీ ఏర్పాటు చేసింది కూడా వైఎస్ రాజశేఖర్రెడ్డి అని గుర్తు చేశారు. రాష్ట్రంలో 54 లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేద న్నారు. పీఆర్సీ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రం లోని లక్షా 91 ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశా రు. ఉద్యోగాలివ్వకుండా ఇంకా ఎంతమందిని చంపుతారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ గొర్రెలు, బర్రెలు కాసుకొని, కూలి పని చేసుకొని బతకాలని సీఎం కేసీఆర్, మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్గౌడ్పై వస్తున్న భూకబ్జాల ఆరోపణ లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం వైఎస్సార్ పార్టీ నిరంతరం పోరాడుతుందని హామీ ఇచ్చారు. నిరుద్యో గులు ఆత్మహత్య చేసుకోవద్దని, పోరాడి ఉద్యోగులు తెచ్చుకుందామని అన్నారు. ఈ కార్యక్రమం లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు సోమయ్య, పార్లమెంటు కన్వీనర్ మరియమ్మ జెట్టి ధర్మరాజు, ప్రమీల, సరోజ, నరసింహారెడ్డి, బొత్సరాజు పాల్గొన్నారు