Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని సాధారణ గురుకుల విద్యాలయ సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి పీఆర్సీ అమలు కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మంగళవారం జీవోనెంబర్ 30 విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ జరిగిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా సాధారణ గురుకులాల్లోని సిబ్బందికీ 30 శాతం ఫిట్మెంట్ ప్రకారం వేతనాలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2020, ఏప్రిల్ ఒకటి నుంచి ఆర్థిక ప్రయోజనం వర్తిస్తుందని వివరించారు. 2020, ఏప్రిల్ ఒకటి నుంచి నుంచి 2021, మార్చి 31 వరకు బకాయిలను ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని తెలిపారు. ఒకవేళ మధ్యలోనే ఉద్యోగి మరణిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ వేతనాలు జులై నుంచి కొత్త వేతనాలు నగదు రూపంలో పొందుతారని వివరించారు.
గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపాళ్ల వేతనం రూ.40,270 నుంచి రూ.58,850 వరకు, పీజీటీల వేతనం రూ.31,460 నుంచి రూ.45,960 వరకు, టీజీటీల వేతనం రూ.28,940 నుంచి రూ.42,300 వరకు పెరుగుతుందని పేర్కొన్నారు. గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపాల్ వేతనం రూ.42,490 నుంచి రూ.62,110 వరకు, జూనియర్ లెక్చరర్ వేతనం రూ.35,120 నుంచి రూ.54,220 వరకు, ఫిజికల్ డైరెక్టర్ వేతనం రూ.35,120 నుంచి రూ.54,220 వరకు, లైబ్రరియన్ వేతనం రూ.35,120 నుంచి రూ.54,220 వరకు పెరిగిందని తెలిపారు.