Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ టీకాపై అపోహలొద్దు : ఉప రాష్ట్రపతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'కోవిడ్ టీకాపై ఎలాంటి అపోహలూ అవసరం లేదు. వ్యాక్సినేషన్ అనేది ఒక ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసర ముంది...' అని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. టీకా వేసుకున్న తర్వాత కూడా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ఆయన నొక్కిచెప్పారు. అసాధారణ సంక్షోభాన్ని అసాధారణ రీతిలోనే ఎదుర్కోవాలనీ, ఇందులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఉప రాష్ట్రపతి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్ కేంద్రాల్లో (హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు) ఏక కాలంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.