Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధుల వినియోగం, ఖర్చు ఏ విధంగా ఉందనే విషయాలను తెలుసుకోవడానికి నిర్వహిస్తున్న ఆన్ లైన్ ఆడిటింగ్లో మరోసారి మన రాష్ట్రంలో తొలిస్థానంలో నిలవటం గర్వంగా ఉందనీ, గ్రామ పంచాయతీల అభివృద్ధిలో మనమే నెంబర్వన్గా ఉన్నామని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా నిధులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని తెలిపారు. అన్ని గ్రామాలను ఆడిటింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయించిందనీ, కనీసం 25శాతం ఆడిటింగ్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నదని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో 40శాతం గ్రామాల ఆడిటింగ్ జరిగిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా అభివృద్ధి పనుల నిర్ణయం, ఖర్చు స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గ్రామ పంచాయతీలకే ఇవ్వడం, అలాగే, ఆయా పనులు ప్రయోజన కరంగా, నిధుల దుర్వినియోగం జరుగకుండా సాధ్యమైందని తెలిపారు.