Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చిన మేరకు వెంటనే పేస్కేలు ప్రకటించాలనీ, పీఆర్సీ జీవో విడుదల చేసి ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు మోసంగి అంజయ్య, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అమ్ముల బాలనర్సయ్య, వంగూరు రాములు, ఉపాధ్యక్షులు సీహెచ్ రాజయ్య, కార్యదర్శి నర్సింహ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 9న కలెక్టరేట్ల ఎదుట తలపెట్టిన ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తామనీ, కోరుకుంటే వారి స్థానంలో వారసులకు ఉద్యోగాలిస్తామన్న హామీని ఎందుకు నెరవేర్చట్లేదని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు.