Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బక్క జడ్సన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కుడాలో చోటు చేసుకున్న అక్రమ లీజు వ్యవహారానికి నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ కేటీఆర్ పేషీలో వినతిపత్రం సమర్పించినట్టు ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ తెలిపారు. కుడా పిఓ అజిత్ రెడ్డిపై సుభాన్ అనే వ్యక్తి వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని గుర్తుచేశారు. అవినీతి నిరోధక శాఖకు దొరికిన తర్వాత కూడా అజిత్ రెడ్డిని అదే స్థానంలో కొనసాగించటంలో ఆంతర్య మేమిటని ప్రశ్నించారు. కేటీఆర్తో పాటు ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్లకు అవినీతిపై కూడా ఫిర్యాదు చేశామని వెల్లడించారు.