Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చికిత్స పొందుతూ మృతి
- సూర్యాపేటలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
నవతెలంగాణ - సూర్యాపేట రూరల్
మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో వృద్ధుడిపై దాడి చేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట మండలం ఎర్రకారం గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని కుమారుడు మొదలా శ్రీనివాస్ వివరాల ప్రకారం..
మొదల లింగయ్య (70)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొన్నేండ్ల కిందట గ్రామానికి చెందిన ఇద్దరు మృతిచెందారు. లింగయ్య మంత్రాలు చేయడంతోనే గ్రామ ప్రజలు చనిపోతున్నారని పలువురు అనుమానం పెట్టుకున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో పడుకున్న మొదల లింగయ్యపై దాడి చేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయన్ను చిన్న కుమారుడు ఉప్పలయ్య చూసి సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 6వ తేదీన మృతిచెందాడు. మృతుని కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ లవకుమార్ తెలిపారు.