Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున తక్షణం ఆర్థిక సాయం చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే టీఆర్ఎస్ సర్కారు అచేతనంగా ఉందని విమర్శిం చారు. ఎన్నికలు లేని చోట కూడా ప్రజలను ఆదుకోవాలని కోరారు. ధాన్యం తడిచి పోయి తినేందుకు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను కాపాడాలని కోరారు. వరదల్లో బండిపోతే బండి, ఇల్లు పోతే ఇల్లు ఇస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, ఎక్కడున్నాడని ప్రశ్నించారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని పర్యవేక్షించాలని సంజరును డిమాండ్ చేశారు.
కేంద్రంపై ఒత్తిడి చేయని కేసీఆర్ : కాంగ్రెస్
విభజన హామీల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయకుండా సీఎం కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మంగళవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ విభజన హామీల అమలు, యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ 2011 కార్యరూపంలోకి వస్తే ఉంటే ఎంతో మంది దళితులు, గిరిజనులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవని తెలిపారు. కేసీఆర్ సీఎంగా కొనసాగే అర్హతను కోల్పోయారని విమర్శించారు.
కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు : జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్, అమిత్ షా కలిసి పులి-మేక ఆట ఆడుతున్నారని అభివర్ణించారు. ఈ ఆటలో బండిసంజరు మొదటి బలిపశువైతే, ఈటల రాజేందర్ రెండో బలిపశువన్నారు.