Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుడు ఎమ్మెల్సీ సుధీర్రెడ్డి బంధువు
నవతెలంగాణ - నల్లగొండ
నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలో వరద నీటిలో పడిపోయిన డాక్టర్ జయశీల్రెడ్డి మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఆయన వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఉన్న నీటి కుంటలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు బయటికి తీశారు. కాలువ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులోపడి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బావ మరిది అయిన జయశీల్రెడ్డి(42) సోమవారం వ్యవసాయ క్షేత్రం వద్దకు వచ్చారు. అక్కడే కుంట అలుగు పోస్తున్న దృశ్యాలను తన సెల్ఫోన్లో తీసి మామ వినోద్రెడ్డికి వాట్సాప్ చేశాడు. కొద్దిసేపటికి ఆయన మామ ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి రెండ్రోజుల నుంచి ఘటనా స్థలం వద్దే ఉండి గాలింపు చర్యలను పరిశీలించారు. మంగళవారం మృతదేహం లభ్యమైంది. ఈనెల 8న యూఎస్ వెళ్లాల్సిన జయశీల్రెడ్డి నీటిలో పడి మృతిచెందడంతో.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యనా.. ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియలేదు.