Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూసీ
- మంచిరేవులకు రాకపోకలు బంద్
నవతెలంగాణ-గండిపేట్
రంగారెడ్డి జిల్లాలోని గండిపేట నాలుగు గేట్లు ఎత్తడంతో మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో మంచిరేవుల గ్రామానికి అధికారులు రాకపోకలను నిలిపివేశారు. మంగళవారం వరద ప్రవాహం ఎక్కువ కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తం అయ్యారు. మున్సిపల్ అధికారులతో పాటు స్థానిక కౌన్సిలర్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్ వరద ఉధృతిని పరిశీలించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నార్సింగి, నగరానికి వెళ్లే వారు బ్రిడ్జి మీదుగా వెళ్లొద్దని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు లేదా రాయల్ ఫంక్షన్ హాల్ మీదుగా వెళ్లాలన్నారు. జోరుగా కురుస్తున్న వర్షాలకు మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు. మంచిరేవుల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని అధికారులు తెలిపారు.