Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో నైరుతిరుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీని ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం ఛత్తీస్గఢ్-ఒడిశా ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందనీ, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతూ నైరుతి దిశకు వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. దీని ప్రభావం వల్ల తెలంగాణ వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ నెల 11న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కొమ్రంభీం అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఐఎంబీ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.రాబోయే 48 గంటలపాటు జీహెచ్ఎంసీలో ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రికార్డయిన వర్షపాతాన్ని పరిశీలిస్తే నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడ్డాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెల్లాల్లో 13.23 సెంటీమీటర్లు, కల్దుర్కిలో 13.15సెంటీమీటర్లు, సలోరలో 13.13 సెంటీమీటర్ల వాన పడింది.